'గబ్బర్‌సింగ్' ఆర్టిస్ట్‌ను ఢీ కొన్న కారు..

  • IndiaGlitz, [Monday,April 22 2019]

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన ‘గబ్బర్‌సింగ్‌’లో నటుడు ఆంజనేయులు తన నటనతో అందర్నీ మెప్పించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. సోమవారం నాడు ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మీదుగా ఇంటికి వస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి కారుతో.. ఆంజనేయులు బైక్‌ను ఢీ కొన్నాడు.

ఈ ప్రమాదంలో ఆయనకు, ఆయన భార్యకు గాయాలయ్యాయి. ఆంజనేయులకు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఆస్పత్రికి వెళ్లి వైద్యం తీసుకున్న భార్యాభర్తలు అనంతరం జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

ఓటర్లపై నోరు జారిన జేసీ దివాకర్ రెడ్డి

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా.. ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంటారు.

'ఏదైనాజ‌ర‌గొచ్చు' టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన వినాయ‌క్‌

ముఖ న‌టుడు శివాజీ రాజా త‌న‌యుడు విజ‌య్ రాజా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న‌ చిత్రం 'ఏదైనా జ‌ర‌గొచ్చు'. వెట్ బ్రెయిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సుధ‌ర్మ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

స‌ల్మాన్ ఖాన్‌పై మీటూ ఆరోప‌ణ‌లు

దేశ వ్యాప్తంగా మీటూ ఉద్య‌మం ఉధృతంగా జ‌రిగి ఇప్పుడిప్పుడే అస‌లు విష‌యం సైలెంట్ అవుతుంది.

'సీత' విడుద‌ల వాయిదా ప‌డ్డ‌ట్టేనా?

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరో హీరోయిన్లుగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'సీత‌'. ఈ సినిమాపై బెల్లంకొండ శ్రీనివాస్ చాలా ఆశ‌ల‌నే పెట్టుకున్నాడ‌ట‌.

ఈ నెల 26న 'దిక్సూచి' విడుదల

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”.