ర‌జ‌నీ కోస‌మే ఒప్పుకున్నాడ‌ట‌

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

డైలాగులు చెప్ప‌డంలో త‌న‌కు తానే సాటి. ఆయ‌న‌ మాటలు పలికే శైలికి ప్రేక్షకలోకం దాసోహం అంటుంది. ఆయనే.. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పాటేకర్. ఈ నటుడు తొలిసారిగా 'కాలా' చిత్రం ద్వారా కోలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. కేవలం రజనీకాంత్ తో ఉన్న సాన్నిహిత్యం వలనే ఈ చిత్రాన్ని ఒప్పుకున్నానని ఈ డైలాగ్ కింగ్ చెప్పుకొచ్చారు.

ఈ సినిమా గురించి నానా మాట్లాడుతూ.. 'కాలా' చిత్రంలో ప్రతినాయకుని పాత్రలో నటించాలని తనని సంప్రదించారని తెలిపారు. అయితే.. త‌ను ఆసక్తి చూపకపోవడంతో రజనీ నేరుగా రంగంలోకి దిగారట‌. నానాను కలిసి స్క్రిప్ట్ వివరించి.. 'సినిమాలో నన్నెవరూ చూడరు" అని చెప్పి ర‌జ‌నీ ఒప్పించార‌ట‌.

ఆయన మంచితనం తెలిసినవాడిగా.. ఆయన మాట కాదనలేక.. రజనీ కోసమే ఈ చిత్రంలో నటించానని నానా చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇటీవల విడుదలైన 'కాలా' ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తమిళంతో పాటు, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పా.రంజిత్ రూపొందించారు. వండర్ బేర్ ఫిలిమ్స్ పతాకంపై రజనీ అల్లుడు ధనుష్ నిర్మించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

More News

రీమేక్ ప్లాన్‌లో సందీప్‌...

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. త‌ను న‌టిస్తున్న సినిమాలు తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌వుతుంటాయి.

ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఇంతకు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నమ‌రెవ‌రి కోస‌మో కాదు.. త‌న అన్న క‌ల్యాణ్ రామ్ కోసం.

ప‌వ‌న్ కోసం మ‌ళ్లీ అనూప్‌...

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల నుండి ప‌క్క‌కు జ‌రిగి రాజ‌కీయాల‌పైనే పూర్తి ఫోక‌స్ పెడుతున్నారు. త‌న జ‌న‌సేన కోసం ఓ పాట‌ను రాయించారు.

నాగ్‌ తో అమ‌లాపాల్‌....

నాని 'జెండాపై క‌పిరాజు' చిత్రం త‌ర్వాత అమ‌లాపాల్ మ‌రో స్ట్ర‌యిట్ తెలుగు సినిమా చేయ‌లేదు. ఇప్పుడు తెలుగు సినిమాలో న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

'నోటా'.. స‌త్య‌రాజ్ పాత్ర ఎలా ఉంటుందంటే..

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'నోటా'. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెహ్రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో.. రాజకీయ వారసుడి పాత్ర‌లో విజయ్ నటిస్తున్నారు.