Chandrababu:జైల్లో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు

  • IndiaGlitz, [Sunday,October 15 2023]

టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు తరపు న్యాయవాదులు శనివారం రాత్రి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చల్లని వాతావరణం ఉండేలా చూడాలని ప్రభుత్వ వైద్యులు చేసిన సూచనను పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి తక్షణమే చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు..

అంతకుముందు జైల్లో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన వైద్యులు చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ ఆయన శరీరంపై దద్దుర్లు ఉన్నాయని.. ప్రస్తుతం 67 కేజీల బరువు ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని ఉన్నతాధికారులకు సూచిస్తామన్నారు. ప్రస్తుతానికి ఆయనను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎవరికైనా డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉందని.. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చామని వెల్లడించారు. ఆయన యాక్టివ్‌గా ఉన్నారని తమతో మామూలుగానే మాట్లాడారని చెప్పారు. జైలుకు రాకముందు ఆయన ఆరోగ్య పరిస్థితి రికార్డ్స్ ఏంటో తమకు తెలియదని వివరించారు.

జైలులో వాతావరణం భిన్నంగా ఉంటుంది..

అనంతరం మీడియాతో మాట్లాడిన డీఐజీ రవికిరణ్ రెడ్డి.. వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టు దృష్టికి తీసుకువెళతామని రవికిరణ్‌ తెలిపారు. చంద్రబాబు హైప్రొఫైల్ ప్రిజనరీ అని ఆయనను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెప్పారు. 24 గంటలు అధికారులు ఆయన ఆరోగ్యం పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో డాక్టర్ల బృందం మాట్లాడారని.. ఆయన వ్యక్తిగత వైద్యులు సూచిస్తే అవసరమైన వైద్య పరీక్షలు చేస్తామన్నారు. ఇంటి వద్ద ఉండే వాతావరణానికి జైలులో వాతావరణం భిన్నంగా ఉంటుందని డీఐజీ వెల్లడించారు.

More News

Purandeswari:అమిత్‌ షా- లోకేశ్‌ భేటీలో ఇదే జరిగింది..? క్లారిటీ ఇచ్చిన పురందేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంపై ఇటీవల కేంద్ర హోంమంత్రితో నారా లోకేశ్ భేటీ అయిన సంగతి తెలిసిందే.

Chandrababu Naidu: చంద్రబాబును ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదు: వైద్యులు

జైల్లో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. రాజమండ్రి జైలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జైలు అధికారులతో కలిసి వైద్యులు పాల్గొన్నారు.

Pravalika: ప్రేమ వ్యవహారం కారణంగానే ప్రవళిక ఆత్మహత్య.. డీసీపీ క్లారిటీ..

తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Chandrababu: చంద్రబాబుతో ముగిసిన లోకేశ్, భువనేశ్వరి ములాఖత్.. బాబు ఆరోగ్యం పట్ల భావోద్వేగం

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబసభ్యులు నారా లోకేష్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు.

KTR: పొన్నాలను కలిసిన మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం..

అనుకున్నట్లే జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య