నిఖిల్ మూవీ రైట్స్ సొంతం చేసుకున్నఅభిషేక్ పిక్చర్స్..

  • IndiaGlitz, [Thursday,February 25 2016]

డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో ప్ర‌వేశించి అన‌తి కాలంలోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న సంస్థ అభిషేక్ పిక్చ‌ర్స్. సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన శ్రీమంతుడు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాల నైజాం రైట్స్ కోసం దిల్ రాజు తో పోటీప‌డి మ‌రీ... చివ‌రికి పంపిణి హ‌క్కులు ద‌క్కించుకోవ‌డం విశేషం.
ఇక ఇప్పుడు డిస్ట్ర‌బ్యూష‌న్ రంగంలో రారాజు దిల్ రాజు తో క‌ల‌సి జ‌ర్నీ చేయాల‌నుకుంటున్నాం అంటూ సుప్రీమ్ రైట్స్ ద‌క్కించుకున్నారు. అలాగే క‌ళ్యాణ వైభోగ‌మే వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను కూడా అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఇలా వ‌రుస‌గా డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ ద‌క్కించుకుంటున్న అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ తాజాగా యువ హీరో నిఖిల్ న‌టిస్తున్న చిత్రం పంపిణీ రైట్స్ సొంతం చేసుకుంది. మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ పై ఆనంద్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న కుమారి 21 ఫేం హేబ్బా ప‌టేల్, అవికా గోర్ న‌టిస్తున్నారు.

More News

ఆ సంఘ‌ట‌నే...క్ష‌ణం క‌థ‌కి స్పూర్తి - డైరెక్ట‌ర్ ర‌వికాంత్

నాగార్జున‌తో ఊపిరి, మ‌హేష్ తో బ్ర‌హ్మోత్స‌వం...ఇలా  భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్.  కోటి రూపాయ‌ల బ‌డ్జెట్ తో పి.వి.పి సంస్థ  నిర్మించిన  సస్పెన్స్ థ్రిల్ల‌ర్ క్షణం.

యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ 'అరకు రోడ్ లో'

రామ్ శంకర్ , నిఖిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వం లో  మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా నిర్మిస్తోన్న 'అరకు రోడ్ లో' చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా 1000 థియేట‌ర్స్ లో మంచు మ‌నోజ్ శౌర్య - నిర్మాత శివ కుమార్

మంచు మ‌నోజ్ - రెజీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం శౌర్య‌. ఈ చిత్రాన్ని కుటుంబ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కించారు. సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శివ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

స‌రికొత్త సినిమా చూసామ‌నే ఫీల్ క‌లిగించే చిత్రం క్ష‌ణం - క్ష‌ణం టీమ్

భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్... మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్  బ్యానర్ తో కలిసి నిర్మించిన సస్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘క్షణం’. అడవిశేష్,ఆదాశర్మ, అనసూయ భరద్వాజ. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన క్ష‌ణం చిత్రాన్నినూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించారు.

మోడీపై సినిమా చేద్దామనుకుంటున్న తెలుగు నిర్మాత...

శ్రీకాంత్,నికిత జంటగా సతీష్ కాశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం టెర్రర్.