రెగ్యులర్ షూట్ లో జగపతిబాబు-నారా రోహిత్ ల 'ఆటగాళ్లు'

  • IndiaGlitz, [Wednesday,December 13 2017]

వెర్సటైల్ ఆర్టిస్ట్స్ జగపతిబాబు-నారా రోహిత్ టైటిల్ పాత్రధారులుగా పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'ఆటగాళ్లు' రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలైంది.'గేమ్ విత్ లైఫ్' అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ హైద్రాబాద్ లో ప్రారంభమైంది.

బ్రహ్మానందం మరో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టిపికల్ స్క్రిప్ట్ తో, వైవిధ్యమైన కథాంశంతో రూపొందనుంది. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పొందేలా సినిమా ఉండబోతోంది. లవ్ కమ్ ఎంటర్ టైన్మెంట్ కూడా పుష్కలంగా ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.

జగపతిబాబు, నారారోహిత్, బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాట‌లు: గోపి, కెమెరా: విజ‌య్‌.సి.కుమార్‌, సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌, ఆర్ట్: ఆర్‌.కె.రెడ్డి, కార్య‌నిర్వాహ‌క నిర్మాత‌: ఎమ్‌.సీతారామ‌రాజు, కో-డైరెక్టర్: నవీన్ రెడ్డి, నిర్మాత‌లు: వాసిరెడ్డి ర‌వీంద్ర‌, వాసిరెర‌డ్డి శివాజీ, మ‌క్కెన రాము, వ‌డ్ల‌పూడి జితేంద్ర‌, స్కీన్‌ప్లే - ద‌ర్శ‌క‌త్వం: ప‌రుచూరి ముర‌ళి.

More News

'ఎంసీఏ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటే్శ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్, లక్ష్మణ నిర్మాతలుగా సినిమా నిర్మితమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ నెల 15 న వస్తున్న లచ్చి

ఓ ప్రముఖ ఛానెల్లో వెన్నెల అనే పోగ్రాం ద్వారా బుల్లి తెర ప్రేక్షకులకి దగ్గరైన జయతి మెట్టమెదటిసారిగా హీరోయిన్ గా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం లచ్చి.

రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ సెన్సార్ పూర్తి

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్.

అప్పుడు ర‌చ‌యిత‌..ఇప్పుడు డైరెక్ట‌ర్‌...

వెంక‌టేష్ సూప‌ర్ హిట్ సినిమాల్లో ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేని సినిమా 'నువ్వు నాకు న‌చ్చావ్'. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. కె.విజ‌య్‌భాస్క‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ మాట‌లు అందించాడు.

మ‌హేష్ సినిమా సినిమాటోగ్రాఫ‌ర్ మారుతున్నాడా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'భ‌ర‌త్ అను నేను'( విన‌ప‌డుతున్న పేరు). కైరా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 27న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.