ఆది పినిశెట్టి - తాప్సీ జంటగా కోన వెంకట్ సమర్పణలో నూతన చిత్రం !!

  • IndiaGlitz, [Sunday,December 03 2017]

కోన వెంకట్ సమర్పణలో "గీతాంజలి" చిత్రాన్ని నిర్మించిన ఎం.వి.వి సినిమా మరియు కోన ఫిలిమ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఒక విభిన్నమైన కథతో నిర్మిస్తున్న నూతన చిత్రం డిసెంబర్ 21న ప్రారంభంకానుంది. "సరైనోడు, నిన్నుకోరి" లాంటి చిత్రాల్లో వెర్సటైల్ రోల్స్ ప్లే చేసి, ఇప్పుడు "రంగస్థలం, అజ్ణాతవాసి" చిత్రాల్లోనూ మంచి పాత్రలు పోషిస్తున్న ఆది పినిశెట్టి కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా తాప్సీ నటించనుండగా మరో ప్రముఖ కథానాయిక కూడా ఈ చిత్రంలో నటించనుంది.

ఆది పినిశెట్టి-తాప్సీ వైవిధ్యమైన పాత్రల్లో నటించనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ హైద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడల నేపధ్యంలో రూపొందనుంది.

వెన్నెల కిషోర్, శివాజీరాజా, తులసి, సాయిచంద్ లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి "లవర్స్" ఫేమ్ హరి దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: అనిల్-భాను, పి.ఆర్.ఓ: వంశీ కాక, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కెమెరా: తోట రాజు (అర్జున్ రెడ్డి ఫేమ్), కళ: చిన్న, సంగీతం: గోపీసుందర్, కూర్పు: ప్రవీణ్ పూడి, కో-డైరెక్టర్: భాస్కర్, మాటలు: కోన వెంకట్-భవానీ ప్రసాద్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ-దర్శకత్వం: హరి.

More News

పాపులర్ స్టార్ సన్నీలియోన్ హీరోయిన్ గా తెలుగు చిత్రం

పలు ఆంగ్ల మరియు హిందీ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ ను దశదిసలా వ్యాపిస్తున్న మోస్ట్ పాపులర్ హాలీవుడ్ లేడీ సన్నీలియోన్ మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్ గా ఒక సినిమా సైన్ చేసింది.

జ‌న‌వ‌రి నుంచి ర‌వితేజ‌, క‌ళ్యాణ్ కృష్ణ చిత్రం?

చాలా గ్యాప్ తర్వాత 'రాజా ది గ్రేట్' సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చారు రవితేజ. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడంతో మంచి ఉత్సాహంలో ఉన్నారీ మాస్ మహారాజ్.

మాస్ పాత్ర‌లో స‌మంత‌

'ఏం మాయ చేసావే' సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన హీరోయిన్ సమంత. తొలి తెలుగు మూవీతోనే జెస్సిగా అందరి హృదయాలని గెలుచుకుంది. 2017 సమంత జీవితంలో చాలా స్పెషల్ అనే చెప్పాలి.

వీరభద్ర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం టైటిల్ ఖరారు

కొత్త న‌టుడు శ్రీకాంత్ హీరోగా, హేమ‌ల‌త (బుజ్జి) హీరోయిన్ గా  వీర‌భ‌ద్ర క్రియేష‌న్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది  హేమ‌ల‌తా రెడ్డి నిర్మాత‌.

రామ్ సాయి గోకులం క్రియేషన్స్ 'ఆకలి పోరాటం'

గంగాధర్, రేణుక, హరీష్ వినయ్, హారిక హీరో, హీరోయిన్ లుగా రామ్ సాయి గోకులం క్రియేషన్స్ వారు ఆనంద్ సాగర్ దర్సకత్వం లో నిర్మించిన చిత్రం ఆకలి పోరాటం ఈ వారం లో రిలీజ్ కి సిద్దమవుతుంది.