ఆది సాయికుమార్, డైమండ్ రత్నబాబుల 'బుర్ర కథ' సినిమా ప్రారంభోత్సవం.

  • IndiaGlitz, [Friday,August 17 2018]

రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్న బాబు తొలిసారి డైరెక్టర్ గా రాబోతున్నారు.. శుక్రవారం లాంచ్ అయిన ఈ సినిమాలో యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరో గా నటిస్తున్నారు..'బుర్రకథ' అనేది సినిమా టైటిల్.. టాలీవుడ్ లోని ప్రముఖ రచయితలు ఈ సినిమా ఓపెనింగ్ కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ సినిమాలోని హీరో ఫస్ట్ సీన్ కి క్లాప్ ని అందించగా , లిరిసిస్ట్ , రచయిత అయిన శివ శక్తి దత్తా కెమెరా స్విచ్ ఆన్ చేసారు..

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డైమండ్ రత్న బాబు మాట్లాడుతూ, ఈ రోజు చాల హ్యాపీ గా ఉంది.. ఎందుకంటే నా తోటి రచయితలు, పెద్దలు ఈ సినిమా ఓపెనింగ్ వచ్చి డైరెక్టర్గా తొలి చిత్రం చేస్తున్న నన్ను ఆశీర్వదించినందుకు..అలాగే ఈ సందర్భంగా నా ప్రొడ్యూసర్స్ కి థాంక్స్ చెప్తున్నాను.. నాకు టాప్ టెక్నిషియన్స్ ని ఇచ్చి సపోర్ట్ చేసినందుకు.. కథ చెప్పిన వెంటనే సినిమా ని ఓకే చేసి నా పై నమ్మకం ఉంచిన హీరో ఆది సాయి కుమార్ గారికి కృతజ్ఞతలు.. ఈ సినిమా ద్వారా స్క్రీన్ ప్లే రైటర్స్ ని పరిచయం చేస్తున్నాను.. వారి కి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.. అన్నారు..

రచయిత శివ శక్తి దత్త మాట్లాడుతూ, ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది.. ఈ సినిమాలో ఒక పాట రాస్తున్నాను.. ఈ సినిమా సక్సెస్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..

హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ,ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాల థాంక్స్.. ఈ సంవత్సరంలో ఇది నా మూడో సినిమా.. ఈ మూడు సినిమాలు నాకు ఎంతో ఎక్జాయిటింగ్ గా ఉన్నాయి.. ముఖ్యంగా ఈ సినిమా చేయడం ఎంతో థ్రిల్ గా ఉంది.. రత్నబాబు గారు మంచి ఫ్రెష్ లైన్ తో వచ్చారు.. ఇందులో నా పాత్ర డిఫరెంట్ గా చాల బాగుంది.. టాప్ టెక్నిషియన్స్ తో ఈ సినిమా చేయడం ఎంతో హ్యాపీ గా ఉంది.. అన్నారు..

నిర్మాత శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ.. మా బ్యానర్ లో ఇది రెండో సినిమా.. బుర్రకథ తప్పకుండ ఓ మంచి సినిమా అవుతుంది.. డెఫినెట్లీ ఈ సినిమా ద్వారా మా బ్యానర్ కి మంచి పేరొస్తుంది.. రేపటినుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.. ఇంకో వారంలో సినిమా కి సంబంధించిన హీరోయిన్స్, ఇతర నటీనటులు కన్ ఫర్మ్ అవుతారు.. అన్నారు.

More News

బాలీవుడ్ రీమేక్‌లో అజిత్‌...

క‌మ‌ర్షియ‌ల్ హీరోగా పేరున్న త‌మిళ స్టార్ హీరో అజిత్ త‌దుపరి ఓ బాలీవుడ్ రీమేక్‌లో న‌టించ‌బోతున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

కేర‌ళ‌కు 'గీత గోవిందం' నిర్మాత విరాళం...

నిన్న తెలుగులో విడుద‌లైన 'గీత గోవిందం' తిరుగులేని విజ‌యాన్ని సాధించింది. సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది.

చై, సామ్ టైటిల్‌...

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి త‌ర్వాత ఓ సినిమాలో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హ‌రీశ్ పెద్ది, సాహు గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.

హిట్ డైరెక్ట‌ర్‌తో మరోసారి...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్నారు. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న చిత్రం 'అరవింద స‌మేత‌..' త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో

'లాస్ట్ సీన్' చిత్రం ప్రారంభం

ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి పతాకంపై హర్ష కుమార్, తులికా సింగ్ హీరోహీరోయిన్లుగా దీపక్ బలదేవ్ ఠాకూర్ దర్శకత్వంలో