ఆది, అడివి సాయికిరణ్ సినిమా అప్‌డేట్‌

  • IndiaGlitz, [Sunday,March 25 2018]

'ప్రేమకావాలి', 'లవ్లీ' సినిమాలతో వ‌రుస విజయాలను సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు ఆది. గత కొంత కాలంగా విజయాలకు దూరమైన ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం  'వినాయకుడు', 'విలేజీలో వినాయకుడు', 'కేరింత' సినిమాలను రూపొందించిన అడివి సాయికిరణ్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంతో ఎయిర్‌టెల్ 4జి భామ సాషా చెట్రి కథానాయికగా పరిచయం కానుంది. మనోజ్ నందం, పార్వతీశం ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. నిత్య నరేష్ కీలక పాత్రలో కనిపించనుంది.

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. విశాఖపట్నం జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడ పోలీసులకు, టెర్రరిస్టుల‌కు మధ్య సాగే కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కొత్త దర్శకుడు విశ్వనాథ్ ఆరిగేల తెరకెక్కించిన ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌లో కూడా ఆది నటించారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం  నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.

వేసవి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ చిత్రాలతో మళ్ళీ విజయాల బాట పట్టాలని ఆది భావిస్తున్నారు.

More News

చిరు సినిమా పై స్పందించిన సుకుమార్‌

గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటూ గ‌త కొంత కాలంగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

విశాఖపట్నంలో వైభవంగా 'కిరాక్ పార్టీ' సక్సెస్ సెలబ్రేషన్స్ !!

నిఖిల్, సిమ్రాన్, సంయుక్త హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'కిరాక్ పార్టీ'. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

'నీది నాది ఒకే కథ' లాంటి గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్‌ - ప్రముఖ దర్శకులు

'అప్పట్లో ఒకడుండేవాడు'లాంటి డిఫరెంట్‌ చిత్రాన్ని నిర్మించిన ఆరాన్‌ మీడియా వర్క్స్‌ సంస్థ లేటెస్ట్‌గా 'నీది నాది ఒకే కథ' వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు.

మహేష్‌ 'భరత్‌ అనే నేను' మొదటి పాట విడుదల

మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'.

'నేల టిక్కెట్టు' మే 24న విడుదల

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, రాజా ది గ్రేట్‌తో అదరగొట్టిన మాస్ మహారాజా రవితేజ