తెలంగాణలో ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీకి భారీ షాక్..

  • IndiaGlitz, [Sunday,November 01 2020]

తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించి తన సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. ఈ సమయంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. తాజాగా బీజేపీ తెలంగాణ కీలక నేత రావుల శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. విషయం తెలుసుకున్న రావుల అనుచరులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావుల ఇంటికి చేరుకుంటున్నారు. అయితే రావుల టీఆర్ఎస్‌లో చేరుతారని సమాచారం.

హైదరాబాద్‌ నగరంలోని జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డి 2018 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే శ్రీధర్‌రెడ్డి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయినప్పటికీ శ్రీధర్‌రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ కార్యకలాపాల్లో చాలా చురుకుగా పాల్గొనే వారు. అయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీధర్‌రెడ్డి పెద్దగా ప్రాధాన్యమివ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర బీజేపీ కమిటీలో కూడా శ్రీధర్‌రెడ్డి ఎలాంటి పదవి లభించలేదు. దీంతో ఆయన మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది.

మీడియా చర్చా వేదికల్లో శ్రీధర్‌రెడ్డి పాల్గొని బీజేపీ తరుఫున గొంతుకను బలంగా వినిపిస్తుండేవారు. నిన్న మొన్నటి వరకూ దుబ్బాక ఉప ఎన్నికపై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. ఇటు ప్రెస్ మీట్‌లలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడేవారు. అలాంటి వ్యక్తి పార్టీకి రాజీనామా చేయనుండటంపై రాష్ట్ర బీజేపీ నేతలు షాక్ అవుతున్నారు. కాగా.. భవిష్యత్ కార్యాచరణపై శ్రీధర్ రెడ్డి ఏం ప్రకటన చేయనున్నారోనని అనుచరులు, కార్యకర్తలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More News

వైభవంగా సిరివెన్నెల కుమారుడి వివాహం..

సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కనిష్ట పుత్రుడు, నటుడు రాజా చెంబోలు ( రాజా భవాని శంకర శర్మ) వివాహం వైభవంగా జరిగింది.

ఏపీలో మరో కొత్త పార్టీ..

ఏపీలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కులం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి అడుగు.. అక్కడ థియేటర్లు ఓపెన్..

కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే.

రజినీ సర్.. మీ ఆరోగ్యం, ఆనందం కంటే ఏదీ ముఖ్యం కాదు: కుష్బూ

ప్రముఖ కథానాయకుడు రజినీకాంత్ ఆరోగ్యంపై ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ స్పందించారు.

కిర్రాక్ ఫ్యాన్.. శ్రీకృష్ణుడిగా మహేష్ లుక్ అదుర్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ చాలా పెద్దది.