'అ..ఆ..'తో  బ్రేక్ ప‌డుతుందా?

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

'ఇష్క్‌', 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' చిత్రాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు నితిన్‌. అయితే.. ఆ త‌రువాత న‌టించిన సినిమాలే నితిన్‌కి ఏ మాత్రం అచ్చి రాలేదు. ఈ నేప‌థ్యంలో త‌న కొత్త చిత్రం 'అ..ఆ.'.పై బోలెడు ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు. ఈ సినిమా కోసం త్రివిక్ర‌మ్ వంటి స్టార్ డైరెక్ట‌ర్‌, స‌మంత లాంటి టాప్ హీరోయిన్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం నితిన్‌కి ప్ల‌స్ అయ్యే అంశ‌మే.

అయితే.. ఈ ఇద్ద‌రి పరంగా నితిన్‌కి ఓ నెగెటివ్ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. ఈ ఇద్ద‌రూ త‌న అభిమాన క‌థానాయకుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అచ్చొచ్చిన వారే. అయితే అలా అచ్చి రావ‌డం మాత్రం నితిన్‌కి ఇంత‌కు ముందు వ‌ర‌కు క‌లిసి రాలేదు. అదెలాగంటే.. ప‌వ‌న్‌తో హిట్ కొట్టిన ద‌ర్శ‌కులు కానీ, హీరోయిన్ కానీ నితిన్‌కి ఏ మాత్రం క‌లిసిరాలేదు.

ప‌వ‌న్‌కి 'బ‌ద్రి'లాంటి హిట్ ఇచ్చిన పూరీ.. నితిన్‌ 'హార్ట్ ఎటాక్‌'కి అంత‌గా అచ్చి రాలేదు. ఇక ప‌వ‌న్ కెరీర్‌ని కీల‌క మ‌లుపు తిప్పిన‌ చిత్ర‌మైన 'తొలి ప్రేమ‌'కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌రుణాక‌ర‌న్‌.. నితిన్‌తో 'చిన్న‌దానా నీకోసం' చేస్తే అది కూడా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే.. 'జ‌ల్సా' రూపంలో ప‌వ‌న్‌కి క‌లిసొచ్చిన ఇలియానా.. 'రెచ్చిపో' అంటూ నితిన్‌తో సినిమా చేస్తే అది డిజాస్ట‌ర్ అయింది.

ఈ నేప‌థ్యంలో 'అత్తారింటికి దారేది' కోసం ప‌వ‌న్‌తో క‌లిసి ప‌నిచేసిన ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, హీరోయిన్ స‌మంత‌తో చేస్తున్న ప్ర‌య‌త్నం నితిన్‌కి సెంటిమెంట్ ప‌రంగా నెగెటివ్ రిజ‌ల్ట్ ఇస్తుందో.. విడివిడిగా క‌లిసిరాని ప‌వ‌న్ డైరెక్ట‌ర్‌, హీరోయిన్ సెంటిమెంట్.. క‌లిసి ప‌నిచేయ‌డం వ‌ల్ల బ్రేక్ అవుతుందో చూడాలి. 'అ..ఆ..' మే 6న విడుద‌ల కానుంది.

More News

అలా..చేస్తే త‌ప్పు ఏమిటి అంటున్న వంశీ పైడిప‌ల్లి..

మున్నా చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతో విజ‌యం సాధించ‌లేక‌పోయినా బృందావ‌నం, ఎవ‌డు చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి. తాజాగా నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో ఊపిరి చిత్రాన్ని తెర‌కెక్కించారు.

చిరు - నాగ్ త‌ర్వాతే బాల‌య్య‌..

మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున త‌ర్వాతే న‌ట‌సింహం బాల‌య్య‌. ఇంత‌కీ ఏ విష‌యంలో అనుకుంటున్నారా...ఇండియా టుడే క‌వ‌ర్ పేజీ పై  బాల‌య్య లెజండ‌రీ పోస్ట‌ర్ వ‌చ్చింది. ఈ స్పెష‌ల్ ఎడిష‌న్ కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈరోజు 3 గంట‌ల‌కు స‌చివాల‌యంలో విడుద‌ల చేయ‌నున్నారు.

చైతు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న మంజిమా మోహ‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం పాట‌లు మిన‌హా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సావిత్రి'

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వటం లో నారా రోహిత్ ఎప్పుడు ముందుంటున్నారు.

బాలీవుడ్ లో ఊపిరి

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించారు. పి.వి.పి సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఊపిరి చిత్రాన్ని నిర్మించింది.