KCR:చిన్న పొరపాటు వల్ల 60 ఏళ్లు గోసపడ్డాం.. మరోసారి అలాంటి తప్పు చేయవద్దు: కేసీఆర్

  • IndiaGlitz, [Wednesday,October 18 2023]

తెలంగాణ రాక ముందు పాలమూరు జిల్లాలో పర్యటిస్తే కన్నీళ్లు వచ్చేవని సీఎం కేసీఆర్ తెలిపారు. జడ్చర్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ పలు అంశాలపై ప్రసంగించారు. ఉద్యమంలో 'పక్కనే కృష్ణమ్మ ఉన్న ఫలితం లేకపాయే, పాలమూరు, నల్గొండ, ఖమ్మమెట్టు పంటలు ఎండిపాయే' అనే పాట రాశానని తెలిపారు. పాలమూరు ఎప్పుడు తన గుండెల్లో ఉంటుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సలహాతో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించానని పేర్కొన్నారు. పాలమూరు దరిద్రం పోవాలంటే ఇక్కడి నుంచే పోటీ చేయాలని ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారని జయశంకర్ సార్ చెప్పారన్నారు.

తెలంగాణ ఎవరూ ఇవ్వలేదు.. చావు నోట్లో తలకాయ పెట్టి సాధించా..

మహబూబ్ నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రం సాధించానని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరూ ఇవ్వలేదని..పోరాటం చేసి సాధించామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారని.. తాను కూడా చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించానని వెల్లడించారు. కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు గోసపడ్డామన్నారు. 1956లో చిన్న పొరపాటు జరిగింది.. మనల్ని తీసుకెళ్లి ఏపీలో కలిపారని.. దాంతో పాలమూరు జిల్లా కరువుతో ఖాళీ, వలస పోయిందని తెలిపారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పాలించినా నీళ్లు ఇవ్వలేదన్నారు. 9టీఎంసీల నీరు ఉండే జూరాల నుంచి నీళ్లు ఇస్తారంట.. ఆ నీళ్లు ఇస్తే రెండు రోజుల్లో జూరాల ఎండిపోతుందన్నారు. శ్రీశైలంలో మనకు వాటా ఉంది కాబట్టే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చామని గుర్తు చేశారు.

24 గంటల కరెంట్ కావాలో.. మూడు గంటలు కావాలో..

9 ఏళ్ల పోరాటం తర్వాత పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయన్నారు. నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్‌ రిజర్వాయర్లు, టన్నెల్స్‌ పూర్తయ్యాయని.. రాబోయే 3, 4 నెలల్లో అన్ని రిజర్వాయర్లలో బ్రహ్మాండంగా నీళ్లను చూడబోతున్నామన్నారు. ఉద్దండాపూర్‌ ప్రాజెక్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలోని 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పారు. కరువు అనేది మన వైపు కన్నెత్తి కూడా చూడదని.. పాలమూరు పాలుకారే జిల్లాగా మారుతుందని కేసీఆర్‌ పేర్కొ్న్నారు. హైదరాబాద్‌కు సమీపంగా ఉండే జడ్చర్లను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు కేవలం 3 గంటల కరెంట్ చాలు అంటున్నారని.. 24 గంటల కరెంట్ కావాలో, మూడు గంటలు చాలో తేల్చేకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జడ్జర్లలో మరోసారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

More News

BJP:తెలంగాణ ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేస్తే బీజేపీకి ప్లస్సా.. మైనస్సా..?

తెలంగాణ ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. పోలింగ్‌కు 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Nadendla:జనసేన కార్యకర్తల కుటుంబాలకు రూ.5లక్షల బీమా చెక్కు అందజేసిన నాదెండ్ల

రెండు రోజుల పర్యటనలో భాగంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

same sex marriages:ఏ దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత ఉందో తెలుసా..?

స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Vijayashanti:గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై బండి సంజయ్ పోటీ? విజయశాంతి ట్వీట్ వైరల్

తెలంగాణలో ఎన్నికల సమరం నెలకొంది. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

BJP Janasena:తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ-జనసేన..!

తెలంగాణ ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో(assembly elections) ఉమ్మడిగా బరిలోకి దిగాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.