Tirumala:తిరుమలలో విషాదం .. చిన్నారిని చంపేసిన చిరుత, తల్లిదండ్రుల ముందే అడవిలోకి లాక్కెళ్లి

  • IndiaGlitz, [Saturday,August 12 2023]

తిరుమలలో దారుణం జరిగింది. అలిపిరి నడక మార్గంలో ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో లక్షిత అనే చిన్నారి తన కుటుంబ సభ్యులతో కలిసి నడక దారిలో శ్రీవారి దర్శనానికి బయల్దేరింది. రాత్రి 11 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.. కుటుంబ సభ్యులు వెనుక వుండగా ముందు వెళ్తున్న చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసింది. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు తేరుకునేలోపే చిరుత పాపను అడవిలోకి ఈడ్చుకెళ్లింది.

ఉదయం చెట్ల పొదల్లో కనిపించిన చిన్నారి మృతదేహం :

దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేపట్టేందుకు వీలు పడలేదు. శనివారం తెల్లవారగానే గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. తొలుత ఎలుగు బంటి దాడిలో చిన్నారి మరణించినట్లుగా పోలీసులు, అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే చిరుత దాడిలోనే పాప మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలింది. తిరుపతి రుయా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దైవ దర్శనానికి వచ్చి ఇలా బిడ్డను కోల్పోవడంతో పాప తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి :

మరోవైపు చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి లక్షిత మరణం అత్యంత బాధాకరమన్నారు. కళ్లముందే బిడ్డను క్రూర జంతువు లాక్కెళ్తే ఆ బాధ వర్ణనాతీతమని.. ఈ మేరకు చిన్నారి తల్లిదండ్రులకు చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి వుంటే ఈ ఘోరం జరిగేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

More News

Chandramukhi 2:'చంద్రముఖి 2' నుంచి 'స్వాగతాంజలి' లిరికల్ సాంగ్ విడుదల

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్  రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’.

YS Jagan:అది నారా వారి ఘన చరిత్ర .. నారీ వ్యతిరేక చరిత్ర, ఇలాంటి వ్యక్తిని సీఎంని చేస్తారా : బాబుపై జగన్‌ విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లను మరోసారి టార్గెట్ చేశారు

Vishal:లక్ష్మీ మీనన్‌తో పెళ్లి.. అంతా అవాస్తవం, ఒక ఆడపిల్ల జీవితంలోకి చొరబొడొద్దు : విశాల్ సీరియస్ కామెంట్స్

ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పెళ్లి కానీ హీరో హీరోయిన్లంతా పెళ్లిపీటలెక్కుతున్నారు.

Bhola Shankar:మెగా అభిమానులకు ఊరట.. భోళా శంకర్‌కు లైన్ క్లియర్, రేపు గ్రాండ్ రిలీజ్ , ఇక రచ్చ షురూ

మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘‘భోళా శంకర్’’ రిలీజ్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది.

Renu Desai :పవన్ డబ్బు మనిషి కాదు.. మధ్యలో పెళ్లిళ్లు , పిల్లలు ఎందుకు : జగన్ బ్యాచ్‌ని చాచికొట్టేలా రేణూ కౌంటర్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌, వైసీపీ  నేతలు ఇటీవలికాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.