Nampally Fire Accident: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

  • IndiaGlitz, [Monday,November 13 2023]

హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్‌ఘాట్‌లోని ఓ రసాయన గోదాంలో ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనంకాగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మంటల్లో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో మెకానిక్ గ్యారేజ్‌ ఉంది. అక్కడ కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వ్యాపించాయి. అదే సమయంలో అక్కడ డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములు ఉండటంతో మంటలు వాటికి వ్యాపించి ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. దీంతో పక్కనే అపార్ట్‌మెంట్లలో ఉంటున్నవారు భయాందోళనకు గురయ్యారు.

తొలుత కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిందని ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌లోకి మంటలు వ్యాపించాయని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో డీజల్ డ్రమ్ముల్లో మంటలు కారణంగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి అపార్ట్‌మెంట్‌లోని పైఅంతస్తులకు వ్యాపించాయన్నారు. మూడు, నాలుగు అంతస్తుల్లో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయని చెప్పారు. పొగ వల్ల ఊపిరాడక కొందరు చనిపోయారని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని డీసీపీ వివరించారు.

More News

Ram Charan:రామ్‌చరణ్ ఇంట్లో దీపావళి వేడుకలు : హాజరైన మహేశ్, ఎన్టీఆర్, బన్నీ .. స్పెషల్ అట్రాక్షన్‌గా వెంకీ మామ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జీవితంలో ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా కుటుంబానికి, సన్నిహితులకు అంతే సమయం కేటాయిస్తారు.

Prime Minister Modi:ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన..

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో

Ravindra Babu:టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత రవీంద్రబాబు కన్నుమూత

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి మరవకముందే..

Chandramohan:చంద్రమోహన్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Prime Minister Modi:అలర్ట్: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే మాదిగ విశ్వరూప సభకు ఇవాళ(శనివారం)సాయంత్రం హాజరుకానున్నారు.