ఒక సీన్‌... ఆరు రూ.6కోట్లు

  • IndiaGlitz, [Saturday,May 09 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. తాజా స‌మాచారం మేర‌కు లారీ ఛేజింగ్‌తో భారీ యాక్ష‌న్ సీన్‌ను చిత్రీక‌రించాల‌నుకుంటున్నార‌ట‌. దీని కోసం టాప్ యాక్ష‌న్ మాస్ట‌ర్స్ ప‌నిచేయ‌బోతున్నార‌ట‌. ఆరు నిమిషాల పాటు సాగే ఈ యాక్ష‌న్ స‌న్నివేశం చిత్రీక‌ర‌ణ‌కు ఆరు కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేయ‌బోతున్నార‌ని టాక్‌.

పాన్ ఇండియా చిత్రంగా చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంలో రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో బన్నీ డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, ర‌గ్డ్ లుక్‌తో కనపడ్డారు. ఫ‌స్ట్ లుక్ చూసిన వారంద‌రూ బన్నీ లుక్‌ కొత్తగా ఉందని అన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వ‌ర‌కు చాలా వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. క‌రోనా వైరస్ కారణంగా ప్రారంభం కావాల్సిన షూటింగ్ ఆగిపోయింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినిమా మా షూటింగ్ మొదలవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డ‌తున్నాయి.