'కత్తి' సరసన మాజీ మిస్ ఇండియా

  • IndiaGlitz, [Sunday,May 25 2014]
View Kalyan Ram Gallery

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం’ షేర్’. గతలంలో కల్యాణ్ రామ్ తో కత్తి సినిమాని రూపొందించిన దర్శకుడు మల్లిఖార్జున్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం మాజీ మిస్ ఇండియా వన్య మిశ్రాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది.

2012లో మాజీ మిస్ ఇండియాగా ఎంపికైన ఈ సుందరి గత సంవత్సరమే తమిళ సినిమాలో నటించాల్సింది. కానీ వీలుపడలేదు. ప్రస్తుతం ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ చదువుతున్న వన్య మిశ్రా ‘షేర్’ తో జతకుడుతుంది. జూన్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.