'24'రిలీజ్ వాయిదా పడనుందా?

  • IndiaGlitz, [Tuesday,March 22 2016]

తమిళ హీరో సూర్య ప్రస్తుతం హీరోగా నటిస్తూ నిర్మాతగా మారి 2డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందిస్తున్న చిత్రం 24. సమంత, ఎమీజాక్సన్ లు హీరోయిన్స్. సైకలాజికల్ థ్రిలర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్ ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. అలాగే ఈచిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేద్దామని అనుకున్నారు. అయితే లెటెస్ట్ గా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కారణంగా సినిమాను మే తర్వాత విడుదల చేద్దామని అప్పుడే విడుదల తేదీని నిర్ణయిస్తామని అనుకుంటున్నరట.

More News

నా లైఫ్ ఛేంజ్ చేసిన‌ సినిమాలు ఇవే అంటున్న త‌మ‌న్నా..

తెలుగు, త‌మిళ్, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ...ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. ప్ర‌స్తుతం త‌మ‌న్నా తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఊపిరి చిత్రంలో న‌టించింది.

తెలుగు ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అలాంటి సినిమా ఊపిరి - నాగార్జున

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

సందీప్ కిషన్ 'రన్' సెన్సార్ పూర్తి

కెరీర్ తొలి నాళ్ళ నుండి డిఫరెంట్ మూవీస్ లో నటిస్తున్న హీరో సందీప్ కిషన్ హీరోగా, అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా ఏ టీవీ రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర నిర్మాతలుగా మిష్టర్ నూకయ్య ఫేమ్ అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రన్’.

నిర్మలా కాన్వెంట్ తర్వాత రోషన్ సినిమాలు చేయడంటున్నహీరో శ్రీకాంత్...

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.