24 కిస్సెస్ సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 26న విడుద‌ల‌

  • IndiaGlitz, [Tuesday,October 09 2018]

24 కిస్సెస్ సినిమా సెన్సార్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి. ‘A’ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అక్టోబ‌ర్ 26న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్ జంట‌గా న‌టిస్తున్న 24 కిస్సెస్ చిత్రాన్ని తొలి సినిమాతోనే ప్రశంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు అయోధ్య కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

బోల్డ్ కంటెంట్ కు తోడు అద్భుత‌మైన క‌థ‌తో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్. హెబ్బా, ఆదిత్ మ‌ధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. అలాగే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌క‌ల‌ను ఈ చిత్రం క‌చ్చితంగా అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. రావు ర‌మేష్, న‌రేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జోయ్ బ‌రువా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఫిలిప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఉద‌య్ గుర్రాల సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా ప‌నిచేసారు.

న‌టీన‌టులు: ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి

More News

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మాగ్నెట్'

విడుదల అయిన ఒక్క ఫస్ట్ లుక్ తోనే కుర్రకారులో అంచనాలు పెంచేసిన చిత్రం మాగ్నెట్. ఈ మధ్యే ఈ సినిమా యూనిట్ సాక్షి చౌదరి హాట్ లుక్ విడుదల చేశారు,

'సాహో' లో ఎయిర్ టెల్ అమ్మ‌డు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'సాహో'.

'మిస్ట‌ర్ మ‌జ్ను' వాయిదా?

అఖిల్ మూడో సినిమా 'మిస్ట‌ర్ మ‌జ్ను'. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మాణంలో రూపొందుతోంది.

మ‌హేశ్ కొత్త రికార్డ్‌!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఓ కొత్త రికార్డుకి శ్రీకారం చుట్టారు. సోష‌ల్ మీడియా వేదిక‌లో భాగ‌మైన ట్విట్ట‌ర్‌లో మ‌హేశ్‌కు ఏడు ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ రీచ్ అయ్యార‌ట‌.

హిట్ పెయిర్‌ రిపీట్ అవుద్దా!!

'ఛ‌లో' సినిమాతో హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా హీరో నాగ‌శౌర్య స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.