పవన్ కళ్యాణ్ చిత్రానికి రూ. 20 కోట్ల సెట్

  • IndiaGlitz, [Thursday,January 30 2020]

ప‌వ‌న్ 27వ చిత్రం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సైలెంట్‌గా స్టార్ట్ అయ్యింది. ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తోన్న ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. పీరియాడిక‌ల్ చిత్రంగా తెర‌కెక్కనున్న ఈ సినిమాలో ప‌వ‌న్ రాబిన్‌హుడ్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. ప‌వ‌న్ పొలిటిక‌ల్ కార‌ణాల‌తో సినిమా ఎక్కువ భాగాన్ని సెట్స్‌లోనే తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. అందుకోస‌మ‌ని భారీ సెట్స్ నిర్మిస్తున్నార‌ని వార్త‌లు కూడా వచ్చిన సంగ‌తి విదిత‌మే. అయితే లేటెస్ట్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు క్రిష్ అండ్ టీమ్ 20 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి తాజ్‌మ‌హల్, ఛార్మినార్ సెట్ వేశార‌ట‌.

ప‌వ‌న్ న‌టించిన తొలిప్రేమ‌, బాలు చిత్రాల్లో తాజ్ మ‌హల్ సెట్ వేశారు. తొలిప్రేమ సినిమాలో తాజ్ సెట్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు క్రిష్ కూడా అలాంటి మేజిక్‌ను క్రియేట్ చేస్తాడేమోన‌ని వేచి చూడాలి. ఇక ఇది పాన్ ఇండియా సినిమా అని అనుకుంటున్నారు కాబ‌ట్టి.. బాలీవుడ్ హీరోయిన్‌ను న‌టింప చేయాల‌ని ప్లాన్స్ చేస్తున్నార‌ని టాక్ విన‌ప‌డుతుంది. కాగా ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఫిబ్ర‌వ‌రి 4 నుండి ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌న్ పాల్గొన‌డం లేదు. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యే స‌రికి వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ చేస్తున్న 'పింక్‌' రీమేక్‌లో త‌న పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటాడ‌ట ప‌వ‌న్‌.