'2.0' మ‌ళ్లీ వాయిదా?

  • IndiaGlitz, [Monday,October 30 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, డైరక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సైంటిఫిక‌ల్ థ్రిల్ల‌ర్ '2.0'. 450 కోట్ల బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు..కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం సినిమా ఇప్పుడు ఏప్రిల్ 13కు వాయిదా ప‌డింది. విఎఫ్ఎక్స్ వ‌ర్క్స్ పూర్తి కావ‌డానికి ఇంకా వ్య‌వ‌థి ప‌ట్టేలా ఉండ‌టంతో యూనిట్ సినిమాను ఏప్రిల్‌కు విడుద‌ల చేయాలనుకుంటున్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం.

2.0 వాయిదా ప‌డ‌టం ఇది రెండోసారి. దీంతో ర‌జ‌నీకాంత్ అభిమానుల‌కు మ‌రోసారి నిరాశ త‌ప్ప‌ట్టే లేదు. అయితే దీనిపై యూనిట్ నుండిఎటువంటి అధికార‌క స‌మాచారం లేదు. ఈ చిత్రం ఆడియో ఈ నెల 27న దుబాయ్‌..బూర్జ్ ఖ‌లీఫా భ‌వంతిలో జ‌రిగింది. అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఎమీజాక్స‌న్ న‌టిస్తుంది.

More News

సూర్య క్రేజీ కాంబో....

సింగం 3 త‌ర్వాత హీరో సూర్య విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తానా సెంద‌కూట్ట‌మ్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా త‌ర్వాత సూర్య చేయ‌బోయే సినిమా పలు వార్త‌లు వ‌చ్చాయి.

మ‌హేష్ కి అలా.. బ‌న్నీకి ఇలా..

ఒకరిది ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చిన డేట్‌కి ఒక రోజు ముందు అనే సెంటిమెంట్‌.. మ‌రొక‌రిది ఆ సీజ‌న్‌లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాన‌న్న సెంటిమెంట్‌తో పాటు ఆ సీజ‌న్‌లోనే ఎక్కువ హిట్‌లు ఇచ్చిన ఘ‌న‌త ఉండ‌డం అనే  సెంటిమెంట్‌.

నివేదా.. రూట్ మార్చుతోందా?

జెంటిల్‌మాన్‌, నిన్ను కోరి, జై ల‌వ కుశ చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకుంది కేర‌ళ‌కుట్టి నివేదా థామ‌స్‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ జూలియ‌ట్ ల‌వ‌ర్ ఆఫ్ ఇడియ‌ట్ అనే సినిమాలో న‌టిస్తోంది.

అనుష్క కొత్త చిత్రం

బాహుబ‌లి2లో చేసిన దేవ‌సేన పాత్ర‌తో న‌టిగా మ‌రింత గుర్తింపుని తెచ్చుకుంది అనుష్క‌. ఆ సినిమా విడుద‌లై ఆరు నెలలు గ‌డిచినా.. ఆమె నుంచి మ‌రో సినిమా రాలేదు. ఆమె తాజా చిత్రం భాగ‌మ‌తి.. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతోంది.

కీలక సన్నివేశాల చిత్రీకరణలో 'నా పేరు సూర్య'

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ లు జంటగా వక్కంతం వంశి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”.