పది మంది టాలీవుడ్ హీరోలు ఏకమయ్యారు?

  • IndiaGlitz, [Friday,December 04 2015]

ప్ర‌కృతి విల‌యాన్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. ఇప్పుడు చెన్నై న‌గ‌రం వ‌ర‌ద తాకిడి విల‌విల‌లాడింది. ఇప్పుడు వాన‌లు త‌గ్గ‌డంతో ప్ర‌జలు భ‌యాందోళ‌న‌లు వీడారు. ప్ర‌భుత్వం త‌ర‌పునే కాకుండా ప్ర‌జ‌లు కూడా స్వ‌చ్చందంగా స‌హాయ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సినిమా ప్రముఖులు త‌మ వంతుగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు, సేక‌రిస్తున్నారు.

వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం మంచు ల‌క్ష్మి స‌హా ప‌ది మంది హీరోలు క‌లిసి మ‌న మ‌ద్రాసు కోసం' అంటూ విరాళాల సేక‌ర‌ణ‌కు ముందుకు వచ్చారు. వీరిలో నాని, అల్ల‌రి నరేష్‌, మంచు మ‌నోజ్‌, రానా, నిఖిల్‌, మధుశాలిని, న‌వ‌దీప్‌, అల్లుశిరీష్‌, తేజ‌స్విని ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం 4-7 గంట‌ల మ‌ధ్య‌లో విరాళాల‌ను సేక‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

More News

డిసెంబర్ 6 'ప్రేమంటే సులువు కాదురా' ఆడియో వేడుక!!

యువ ప్రతిభాశాలి చందా గోవింద్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ..ఆర్.పి.క్రియేషన్స్ పతాకంపై భవనాసి రాంప్రసాద్ నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథా చిత్రం 'ప్రేమంటే సులువు కాదురా'.

చెన్నై కోసం 'నేను సైతం' అంటున్న రకుల్ ప్రీత్ సింగ్

అధిక వర్షాల కారణంగా నానా ఇబ్బందులకు గురవుతున్న చెన్నై వాసులకు మన తెలుగు కథానాయకులు ఆసరాగా నిలుస్తున్న విషయం తెలిసిందే.

వైజాగ్ లో చైతు, శ్రుతి..

యువ సమ్రాట్ నాగ చైతన్య హీరోగా కార్తీకేయ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్ రీమేక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

కోనకి కోపం వచ్చింది..

స్టార్ రైటర్ కోన వెంకట్ కథ, కథనం అందించడంతో పాటు చిత్ర సమర్పకుడిగా వ్యవహరించిన తాజా చిత్రం శంకరాభరణం. ఈ మూవీలో నిఖిల్, నందిత జంటగా నటించారు. ఎన్నో అంచనాలతో శంకరాభరణం ఈరోజు రిలీజైంది.

సునీల్ మూవీ టైటిల్...

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ సినిమా విడుదలైన చాలా కాలమైంది.ప్రస్తుతం కృష్ణాష్టమి విడుదలకు సిద్ధమవుతుంది.