మూడురోజుల్లో పది కోట్ల గ్రాస్ వచ్చింది - కోనవెంకట్

  • IndiaGlitz, [Monday,December 07 2015]

ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. 'గీతాంజలి' వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 4న విడుద‌లైంది. ఈ సినిమా స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో కోన‌వెకంట్ మాట్లాడుతూ ..సినిమా మూడు రోజుల్లో ప‌ది కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసింది. ఫ‌స్టాప్ కంటే సెకండాఫ్, ముఖ్యంగా పృథ్వీ కామెడికి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. నిఖిల్ పెర్‌ఫార్మెన్స్ గురించి అంద‌రూ మెచ్చుకుంటున్నారు. సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైన అంద‌రికీ థాంక్స్ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ...ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసిన సినిమా ఇది. మా టార్గెట్‌ను రీచ్ అయిన‌ట్టుగా భావిస్తున్నాం అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌ప్త‌గిరి, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, వైవా హ‌ర్ష‌, నైజాం డిస్ట్రిబ్యూటర్ అశోక్ త‌దిత‌రులు పాల్గొన్నారు. చెన్నై వరద బాధితుల కోసం శంకరాభరణం ఐదు లక్షల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2500 కిలోల బియ్యాన్ని చెన్నైకు పంపుతున్నట్లు కోనవెంకట్ తెలియజేశారు.

More News

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీకి ముహుర్తం ఖరారు

యంగ్ టైగర్ నటించిన తాజా చిత్రం నాన్నకు ప్రేమతో... సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు.

బెంగాల్ టైగర్ లో బ్రహ్మి క్యారెక్టర్ ఇదే..

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్. సంపత్ నంది తెరకెక్కించిన బెంగాల్ టైగర్ మూవీని ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం నటించారు.

'బెంగాల్ టైగర్' అడ్వాన్స్ బుకింగ్ కి భారీక్రేజ్

మాస్ మహరాజ్ రవితేజ,అందాల భామలు తమన్నా,రాశిఖన్నాలు జంటగా,సంపత్ నంది దర్వకత్వంలో,నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్ టైగర్

స్పీడు పెంచిన గోపీచంద్...

గోపీచంద్ నటించిన తాజా చిత్ర సౌఖ్యం. ఈ చిత్రాన్ని ఎ.ఎస్.రవికుమార్ తెరకెక్కించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 13న ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

నాన్నకు ప్రేమతో.. ఆడియో డేట్ ఫిక్స్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో..ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.విఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.