1 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో దూసుకుపోతోన్న ‘రెచ్చిపోదాం బ్రదర్’ లిరికల్ సాంగ్

  • IndiaGlitz, [Monday,August 31 2020]

ప్రచోదయ ఫిల్మ్స్ పతాకం‌పై కిరణ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రదారులుగా ఏ. కె. జంపన్న దర్శకత్వంలో.. వివి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. అన్ని హంగులతో ముస్తాబైన ఈ చిత్రానికి సాయి కార్తీక్ స్వరాలను అందించారు. కాగా ఈ చిత్ర లిరికల్ సాంగ్‌ను ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లిరికల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వస్తుందని, ఇప్పటికే వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ సాంగ్‌కి రావడం ఎంతో సంతోషంగా ఉందని చిత్రయూనిట్ ప్రకటించింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. మా చిత్రానికి మెయిన్ హైలైట్ సాయికార్తీక్‌గారు అందించిన సంగీతం. అది ప్రస్తుతం విడుదలైన లిరికల్ వీడియో సాంగ్‌తోనే ప్రూవ్ అయింది. అలాగే ఆయన అందించిన రీ రికార్డింగ్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. మాములుగా 1 మిలియన్ వ్యూస్ పొందాలంటే మాస్ బీట్ సాంగ్ లేదంటే లవ్ సాంగ్ అయితే.. అతి తొందరగా రీచ్ అయి వ్యూస్ సాధిస్తుంది. కానీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఒక స్ఫూర్తిదాయకమైన మా చిత్ర సాంగ్‌ ఇంత త్వరగా 1 మిలియన్ వ్యూస్ సాధించిందంటే అందుకు సాయి కార్తీక్ సంగీతం, భాస్కరభట్ల లిరిక్స్, భాను కొరియోగ్రఫీనే కారణం. భారీ తారాగణం, మంచి టెక్నీషియన్స్ ఉన్న ఈ సినిమా ‘జాగో’ పాటతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. అలాగే మా చిత్రంలో హీరో కిరణ్, అతుల్ కులకర్ణి మధ్య సాగే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఎమోషన్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ సమపాళ్లతో ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే చిత్రమిది. ‘జాగో’ పాట ఇంత పెద్ద సక్సెస్ సాధించడంతో చిత్రయూనిట్ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నాం. పాటను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము..’’ అని అన్నారు.

More News

ఈ సినిమా థియేటర్‌లో చూస్తే చాలా బాగుంటుందన్నారు: ‘వి’ డైరెక్టర్

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘వి’.

139మంది నాపై అఘాయిత్యానికి పాల్పడలేదు: షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యువతి

తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ సంచలనం సృష్టించిన యువతి నేడు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.

ఒంటి స్తంభంపై ఆరు వరసల అద్భుతం.. దుర్గగుడి ఫ్లై ఓవర్..

ఒంటి స్తంభంపై ఆరు వరసల అద్భుతం.. దేశంలోనే అత్యద్భుత ఫ్లై ఓవర్‌..

రియాకు మద్దతుగా మంచు లక్ష్మి ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో.. ఆయన మాజీ ప్రేయసి రియా చక్రవర్తి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

కరోనాతో మరో టాలీవుడ్ నిర్మాత మృతి

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతేగాకుండా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.