వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన 'సైజ్ జీరో' ట్రైలర్

  • IndiaGlitz, [Friday,November 06 2015]

సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ నిర్మించిన భారీ చిత్రం సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .బాహుబలి', రుద్రమదేవి' వంటి విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క మరో విలక్షణమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ సైజ్ జీరో'తో నవంబర్ 27న మన ముందుకు రానుంది. ఇంజి ఇడుపళగి' అనే పేరుతో ఈ చిత్రం తమిళంలో కూడా నవంబర్ 27నే విడుదల కానుంది.

ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కింది. దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి విన్నూతమైన సబ్జెక్ట్ తో కమర్షియల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న సైజ్ జీరో' సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి అందించిన ఆడియో, ట్రైలర్ నవంబర్ 1న విడుదలయ్యాయి. ఆడియో, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం యూ ట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుని ట్రెండ్ క్రియేట్ చేసింది. రేపు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న అనుష్కకు ఇది చాలా ఆనందాన్ని కలిగించే విషయం.

అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి,దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

More News

చిరు మూవీపై వినాయ‌క్ కామెంట్..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా త‌మిళ చిత్రం క‌త్తి సినిమా రీమేక్ చేయ‌నున్న‌ట్టు...ఈ మూవీకి వినాయ‌క్ డైరెక్ట‌ర్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి.

'త్రిపుర' మూవీ రివ్యూ

కొన్ని సినిమాలకు క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ సినిమా మీద ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ తెచ్చేస్తుంది. త్రిపురకు కూడా విడుదలకు ముందు మరింత క్రేజ్ వచ్చింది. త్రిపుర పాత్రలో స్వాతి నటించడం వల్ల కావచ్చు. గీతాంజలి సినిమా తీసిన దర్శకుడు తీస్తున్న మరో సినిమా అనీ కావచ్చు.

బాలీవుడ్ శ్రీమంతుడికి పోటాపోటీ

టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన‌ మూవీ శ్రీమంతుడు. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కించారు.

'ఓ మై గాడ్' ఆడియో విడుదల

తనీష్,మేఘశ్రీ,పావని ప్రధానపాత్రల్లో శ్రీ వెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం ''ఓ మై గాడ్''. వి.శ్రీవాత్సవ్ దర్శకుడు.ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.

సమంత, అమీతో పాటు...

క్యూట్ గర్ల్స్ సమంత,అమీ జాక్సన్ రెండు తమిళసినిమాల కోసం కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.విజయ్ హీరోగా ''రాజా రాణి''దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రంతో పాటు..